ప్రజాబలగం : మియాపూర్ బాలిక హత్య కేసులో భయానక వాస్తవం వెలుగులోకి వచ్చింది. జూన్ 7వ తేదీన మిస్సైన 12 ఏళ్ల బాలిక బానోతు వసంతను కన్నతండ్రే హత్య చేశాడని తేలింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మియాపూర్ ఏసీపీ పి. నర్సింహారావు మీడియాకు తెలిపారు. మద్యానికి, సెల్ ఫోన్లో అశ్లీలతకు బానిసైన నిందితుడు నరేష్.. కన్న కుమార్తెపైనే అఘాయిత్యం చేయబోయాడని, అమ్మకు చెప్తానని పాప అరవడంతో చంపేశాడని తెలిపారు.కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే కూతురు పట్ల కాలయముడు అవుతాడని ఎవరైనా ఊహిస్తారా..! అభం శుభం తెలియని ఆ బాలిక మాత్రం ఎలా ఊహిస్తుంది? సభ్యసమాజం తల దించుకునే ఘటన ఇది. మియాపూర్లో సంచలనం సృష్టించిన 12 ఏళ్ల బాలిక ‘వసంత’ అనుమానాస్పద మృతి కేసులో భయానక వాస్తవం వెలుగులోకి వచ్చింది. పాపను హత్య చేసింది కన్నతండ్రేనని తేలింది. అమ్మాయిని హత్య చేసి, 12 రోజులుగా కపట నాటకాలు ఆడుతూ పోలీసులనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి, కన్నకుమార్తెతోనే కోరిక తీర్చుకునేందుకు ప్రయత్నించి.. ‘అమ్మకు చెప్తా..’ అని పాప అరవడంతో దారుణంగా కొట్టి చంపేశాడు.మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిగడ్డ తండాలో ఈ నెల 7న ఉదయం 12 ఏళ్ల చిన్నారి వసంత కనిపించకుండాపోయింది. బంధువులతో కలిసి పరిసర ప్రాంతాల్లో గాలించిన తల్లిదండ్రులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. బాలిక తండ్రి బానోతు నరేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.స్కూల్కు వెళ్లమని చెప్తే బాలిక వినలేదని.. సొంతూరుకి వెళ్లిపోదామని మారం చేసిందని.. ఆ తర్వాత ఇంట్లోంచి వెళ్లిపోయిందని పోలీసులతో బాలిక తండ్రి చెప్పాడు. నరేష్ ప్రవర్తనాతీరుపై పోలీసులకు ఆది నుంచే అనుమానం కలిగింది. కేసు దర్యాప్తులో ఉండగానే.. ఈ నెల 13న రాత్రి నడిగడ్డ తండాలోని చెట్ల పొదల్లో కుళ్లిపోయిన స్థితిలో ఓ బాలిక మృతదేహం లభించింది. దుస్తుల ఆధారంగా అది వసంత మృతదేహమేనని తల్లిదండ్రులు గుర్తించారు.ఇదే సమయంలో సీసీటీవీ ఫుటేజీల నుంచి పోలీసులు కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. బాలిక మిస్సైందని చెప్పిన రోజు ఉదయం 10 గంటలకు నరేష్ తన కుమార్తెను బైక్పై తీసుకెళ్లాడు. 11 గంటల సమయంలో బైక్ రోడ్డు పక్కన నిలిపివేసి, బాలికను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత 11 నిమిషాలకు ఒంటరిగా బయటకి వచ్చాడు.నరేష్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధం కాగా.. అతడు అప్పటికే స్థానికంగా ఓ పెద్ద మనిషిని కలిసి తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసుల ముందు లొంగిపోయాడు.నరేష్ కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. సెల్ ఫోన్లో తరచూ పోర్న్ వీడియోలు చూసేందుకు అలవాటుపడ్డాడు. జూన్ 7న అతడి సెల్ ఫోన్ డిస్ప్లే పనిచేయలేదు. సొంతూరికి వెళ్లిపోదామని మారాం చేస్తున్న కుమార్తెను బైక్పై ఎక్కించుకొని బయటకి తీసుకొచ్చాడు. అమ్మకు చెప్తా అంటూ ఏడ్చిన బాలిక నడిగడ్డ తండా సమీపంలోని చెట్ల పొదల వద్ద బైక్ నిలిపేసి.. వంటకు అవసరమైర కట్టె పుల్లలను ఏరుకొద్దామని చెప్పి కుమార్తెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై బలవంతం చేయబోయాడు. అమ్మకు చెప్తా అంటూ ఏడుస్తూ బాలిక పెద్దగా అరవడంతో.. కాలనీలో తెలిస్తే, తన పరువు పోతుందని నరేష్ భయపడ్డాడు. పారిపోయేందుకు ప్రయత్నించిన తన కుమార్తె తల వెంట్రుకలు పట్టుకొని బలంగా బండకేసి కొట్టాడు. ఆ దెబ్బకు ముక్కులోంచి రక్తస్రావం అవుతుండగా బాలిక వసంత కుప్పకూలిపోయింది. కుమార్తె ముక్కూ, నోరూ, చెవులు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు.తర్వాత ఏమీ తెలియనట్లు చెట్ల పొదల్లోంచి బయటకు వచ్చి, బైక్ వద్దకు వచ్చేశాడు. తిరిగి మళ్లీ ఘటనా స్థలానికి వచ్చి బాలిక తలపై బండరాయితో బలంగా మోదాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చేశాడు. అమ్మాయి కనిపించట్లేదని భార్య శారదకు చెప్పాడు. కపట నాటకంతో అందరినీ నమ్మించాడు.మహబూబ్బాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామం లక్ష్మణ తండాకు చెందిన బానోతు నరేష్, శారద దంపతులు బతుకుదెరువు కోసం మియాపూర్ సమీపంలోని నడిగడ్డ తండాకు వలస వచ్చారు. ఇక్కడికి వలస వచ్చిన 15 రోజులకే కన్న కూతురిని నరేష్ హత్య చేశాడు. వరుసగా 3 రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చూసి వచ్చాడు నిందితుడు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను మియాపూర్ ఏసీపీ పి. నర్సింహారావు బుధవారం (జూన్ 19) మీడియాకు వెల్లడించారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే, ఇలాంటి ఘటనలను నివారించేందుకు, నిందితులను త్వరితగతిన గుర్తించేందుకు వీలు కలుగుతుందని ఆయన అన్నారు.
Comments