ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి మాపై దుష్ప్రచారాలు చేస్తున్నారు.




ప్రజాబలగo : అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ఇప్పటికీ ఎలాంటి హామీలు నెరవేర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీకి వచ్చే నష్టాన్ని మాత్రం అంచనా వేసుకోలేకపోయింది. పేద మహిళలకు ఇస్తామన్న పింఛన్లు ఇంకా ఇవ్వకుండా పేద మహిళలకు నిరాశే మిగిల్చింది. రేవంత్ రెడ్డి 42 లక్షల మందికి బాకీపడి ఉన్నాడు. రైతులకు, కౌలు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రజలను ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నారు. 100 రోజుల పాలనలో రాష్ట్రాన్ని ఎన్నడూ లేనంతగా మారుస్తామని చెప్పి 200 మంది రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారని ధ్వజమెత్తారు. పటాన్ చెరువు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి బిఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు హరీష్ రావు. హరీష్ రావు మాట్లాడుతూ గణేష్ గడ్డ బిఆర్ఎస్ కు కలిసి వచ్చిన గడ్డ అని అన్నారు. 2004 నుంచి ఇప్పటివరకు గులాబీ జెండా మెదక్ పార్లమెంట్లో ఎగురుతూనే ఉంది అని చెప్పారు. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ గెలుస్తుంది అని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలని అధికారంలోకి వచ్చి ప్రజలను సైతం మాయ చేస్తుందని విమర్శించారు. కెసిఆర్ రైతుల దగ్గరకు పోయి పరామర్శిస్తే అది చూసి తట్టుకోలేక రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయనపై మండిపడ్డారు. బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి లోకల్ కాదంటూ కావాలనే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయన తెల్లాపూర్ లోనే ఉంటారని హరీష్ రావు అన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కావాలనే బి ఆర్ ఎస్ పార్టీని దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలా మాపైన తప్పుడు ప్రచారాలు మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని ఆయన హెచ్చరించారు.

Comments