10 శాతమే తగ్గిన మంచినీటి సరఫరా



ప్రజాబలగం : రాష్ట్రంల ఎండాకాలం ప్రారంభంలోనే చాలా ప్రాంతాలలో నీటి కొరత ఏర్పడింది. త్రాగునీటి సమస్యలు పెరిగిపోయాయి. ఇదే అలుసుగా నీటి ట్యాంకర్ల సప్లయర్లు జనాల వద్ద వందల నుంచి వేరే వరకు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ నీటి కొరత మాత్రం అలాగే ఉన్నది. ఇక సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఈ తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చూసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ఇంకొక 100 కోట్లయినా సరే తాగునీటి సరఫరా కోసం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నీటి కొరత ఉన్నచోట్ల ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి పెట్టాలని కంప్లైంట్లు వస్తే వెంటనే స్పందించి వాటికి తగ్గ పరిష్కారాలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ ను మినహా ఇస్తే రాష్ట్రంలో మొత్తం 142 పట్టణాలు ఉన్నాయి. వీటిలో 130 మున్సిపాలిటీలో 12 కార్పొరేషన్లు. ఇక తాగునీటి కొరత ఎక్కువగా పది మున్సిపాలిటీలో కరీంనగర్ ఖమ్మం కార్పొరేషన్లో పరిధిలోనే ఉన్నట్టు గుర్తించారు. రోజులతో పోలిస్తే సాధారణ శాతంలో 10 శాతం లోపు తాగునీటి సరఫరా తగ్గిందని అయినప్పటికీ ప్రజలకు వారి అవసరాలకు సరిపడేలాగానే నీటిని అందిస్తున్నట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. రోజుకు సగటున 1398.05 ఎం ఎల్డి, ల త్రాగునీటి సరఫరా జరుగుతుండగా ప్రస్తుతం మాత్రం 1371 ఎంఎల్డీల నీటి సరఫరా జరుగుతోంది. అయితే సాధారణం కంటే కేవలం 26.31 ఎంఎల్డీ ల నీటి కొరత మాత్రమే నెలకొన్నది. తలసరి నీటి అవసరాన్ని పరిశీలిస్తే 27 పట్టణాల్లో ప్రస్తుతం 135 ఎల్పిసిడి కంటే ఎక్కువ నీటి సప్లై ఉన్నది. 48 పట్టణాల్లో 100 నుంచి 135 ఎల్పీసీడీల మధ్య తాగునీటి సరఫరా జరుగుతున్నది. 100 lpc డీల కంటే తక్కువగా సరఫరా అవుతున్న 67 పట్టణాలను సమస్యత్మకమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. ఎండలు పెరిగినాకొద్దీ ఖమ్మం,కరీంనగర్ పట్టణాల్లో నీటి ఎద్దడి పెరుగుతుందనే అంచనాలతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 23,839 ఆవాసాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. తాగునీటి ఎద్దడి లేదని మిషన్ భగీరథ అధికారులైతే చెప్తున్నారు. అన్ని గ్రామాల్లో 100 ఎల్పీసీడీల నీటి సరఫరా చేస్తున్నారు ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు గ్రిడ్ పంపులతో పాటు స్టాండ్ బైగా పంపులు అందుబాటులో ఉంచి పట్టణాలు గ్రామాలన్నింత సమీప నీటి వనరులను ఉపయోగించుకోవాలని ఇప్పటికే అన్ని కార్పొరేషన్లు మరియు మున్సిపల్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇప్పుడు ఉన్న నీటి కొరతలపై అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు ఎటువంటి నీటి సమస్యలు రాకుండా చేయాలనే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Comments